పామాయిల్ సాగును పరిశీలించిన ఏవో.. రైతులకు కీలక సూచనలు

by Jakkula.Mamatha |

హిమాంనగర్ గ్రామంలో పామ్ ఆయిల్ ప్లాంటేషన్ మండల వ్యవసాయ అధికారి అవుకు నరసింహారావు సందర్శించారు.

పామాయిల్ సాగును పరిశీలించిన ఏవో.. రైతులకు కీలక సూచనలు
X

దిశ, ఏన్కూర్: హిమాంనగర్ గ్రామంలో పామ్ ఆయిల్ ప్లాంటేషన్ మండల వ్యవసాయ అధికారి అవుకు నరసింహారావు సందర్శించారు. ఈ క్రమంలో రైతులకు పామ్ ఆయిల్ పంట మంచి లాభదాయకమని, రైతులు పామ్ ఆయిల్ పంట వేసుకోవడానికి మొగ్గు చూపాలని చెప్పారు. పంట వేసేటప్పుడు 2-3 అడుగుల లోతు గుంత తీసి 1-2 సంవత్సరాల మొక్కలు నాటితే మొక్కల వేర్లు నేలలో కూచించుకుని పోయి వర్షాభావ పరిస్థితుల్లో ఎటువంటి నష్టం వాటిల్లకుండా దృఢంగా ఉంటాయని సూచించారు. అదే విధంగా పామ్ ఆయిల్‌లో అంతర పంటలు సాగు చేసి అధిక ఆదాయం మరియు ప్రభుత్వం ఎకరాకు 4 వేల చొప్పున ఆర్థిక సహాయం చేస్తుందని చెప్పారు. రైతులు పామ్ ఆయిల్ సాగును విస్తృతంగా పెంచి మంచి లాభాలు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి సపావట్ సైదులు రైతు సేవా కేంద్రం ప్రతినిధి సాయి రైతులు బానోత్ సురేష్, బానోత్ రాజోలి తదితరులు పాల్గొన్నారు.

Next Story