రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

by Mahesh |
రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి
X

దిశ, మియాపూర్: రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. యస్‌ఐ రవికిరణ్ తెలిపిన వివరాల ప్రకారం.. తేదీ 16న ఉదయం 11.30 సమయంలో ప్రనాం హాస్పిటల్ వద్ద రోడ్డు దాటుతుండగా మియాపూర్ నుంచి చందానగర్ వైపు వస్తున్న ఆటో టీ ఎస్ 08 యూ జే 2368 బలంగా ఢీ కొట్టింది. దీంతో తలకు తీవ్ర గాయాలు కాగా అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా చనిపోయిన వ్యక్తి చిత్తు కాగితాలు ఏరుకుంటూ జీవితం సాగిస్తున్నట్లు సమాచారం. సంబంధీకులు ఎవరైనా ఉంటే 9490617126, 9000123281 నెంబర్‌ను సంప్రదించాలన్నారు.

Next Story

Most Viewed