ఓటర్ల జాబితా ప్రకారం విచారణ జరపాలి.. డీసీ వాణి

by Batti.Sumithra |

ఓటర్ల జాబితా ప్రకారం విచారణ జరపాలని ఘట్కేసర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ వాణి అన్నారు.

ఓటర్ల జాబితా ప్రకారం విచారణ జరపాలి.. డీసీ వాణి
X

దిశ, ఘట్కేసర్ : ఓటర్ల జాబితా ప్రకారం విచారణ జరపాలని ఘట్కేసర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ వాణి అన్నారు. గురువారం ఘట్కేసర్ డివిజన్ లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) 2026 పై డీసీ వాణి స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఘటకేసర్ సర్కిల్-06 లోని ఘట్కేసర్ వార్డులో క్షేత్రస్థాయిలో సమగ్ర తనిఖీలు నిర్వహించారు. అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్, పర్యవేక్షక అధికారులు, బూత్ లెవెల్ ఆఫీసర్స్, బూత్ లెవెల్ ఏజెంట్లతో కలిసి వెళ్లిన డిప్యూటీ కమిషనర్ ఓటరు జాబితాలను సమీక్షించారు. అలాగే అధికారిక ఎన్నికల సామాగ్రి పంపిణీని పర్యవేక్షించడంతో పాటు, ఓటర్ల జాబితా ఖచ్చితత్వాన్ని నిర్ధారించడానికి ఇంటింటి ధృవీకరణ డ్రైవ్‌ల సమయంలో స్థానిక నివాసితులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీలు వెంకటేశం, వేణుగోపాల్, బీఎల్ఓ సూపర్వైజర్లు, బీఎల్ఓలు పాల్గొన్నారు.

Next Story