ఫలితాల్లో బీజేపీ తగ్గింది: ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ట్వీట్

by Disha Web Desk 17 |
ఫలితాల్లో బీజేపీ తగ్గింది: ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ట్వీట్
X

లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్‌యాదవ్ తొలిసారి స్పందించారు. ఎన్నికల్లో మద్దతుగా నిలిచిన ఓటర్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అంతేకాకుండా బీజేపీ సీట్ల పరంగా తగ్గిందని చెప్పారు. ఈ విషయాన్ని శుక్రవారం ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. 'మేము బీజేపీ సీట్ల సంఖ్య తగ్గుతుందని చూపించాం. ఇకపై ఇదే కొనసాగుతుంది. దాదాపు సగానికి పైగా అబద్ధాలు తుడిచి పెట్టుకుపోయాయి. మిగిలినవి కూడా వీటిని అనుసరిస్తాయి. అయితే ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగుతుంది' అని ట్వీట్ చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక అఖిలేష్ తొలిసారి స్పందించడం విశేషం. యూపీలో మొత్తం 403 స్థానాల్లో బీజేపీ మిత్రపక్షాలు 273 స్థానాల్లో గెలుపొందగా, ఎస్పీ మిత్రపక్షాలతో కలిసి 125 సీట్లు గెలుపొందింది. క్రితం సారితో పోలిస్తే దాదాపు 73 సీట్లు ఎస్పీ ఖాతాలో చేరడం విశేషం.



Next Story

Most Viewed