ఎంపీ పదవికి ఎస్పీ చీఫ్ అఖిలేష్ రాజీనామా

by Disha Web Desk 12 |
ఎంపీ పదవికి ఎస్పీ చీఫ్ అఖిలేష్ రాజీనామా
X

న్యూఢిల్లీ: సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటు స్థానానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని మంగళవారం లోక్‌సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లాకు అందజేశారు. కాగా, తాజా ఎన్నికల్లో అసెంబ్లీ స్థానం నుంచి ఆయన గెలుపొందిన సంగతి తెలిసిందే. అయితే పార్టీ మాత్రం 111 స్థానాల్లో గెలుపొంది రెండో స్థానంతో సరిపెట్టుకుంది. దీంతో రాష్ట్రంలో ఉండి ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు ఎంపీ పదవికి రాజీనామా చేసినట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. 2027 యూపీ ఎన్నికలను లక్ష్యంగా పెట్టుకుని రాష్ట్ర రాజకీయాల్లో తన వంతు పాత్ర పోషించనున్నట్లు పేర్కొన్నాయి. కాగా, అఖిలేష్ రాజీనామాతో యూపీలో ఎస్పీ ఎంపీ సీట్లు నాలుగుకు తగ్గాయి.


Next Story