- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను’.. నటుడు రాజేంద్రప్రసాద్ భావోద్వేగం
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం పద్మ అవార్డులు ప్రకటించిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్డెస్క్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం పద్మ అవార్డులు ప్రకటించిన విషయం తెలిసిందే. తెలుగు దిగ్గజ నటుడు రాజేంద్ర ప్రసాద్(Padma Shri Rajendra Prasad)కు పద్మశ్రీతో కేంద్రం సత్కరించింది. తాజాగా రాజేంద్రప్రసాద్ స్పందించారు. ఈ మేరకు వీడియో విడుదల చేశారు. ‘కేంద్ర ప్రభుత్వం నాకు 'పద్మశ్రీ' పురస్కారాన్ని ప్రకటించడం నా జీవితంలో మర్చిపోలేని రోజు. ఈ గౌరవం కేవలం నాకు మాత్రమే దక్కింది అని నేను అనుకోవడం లేదు. ఇది తెలుగు హాస్యానికి, వినోదాన్ని కోరుకునే సామాన్య ప్రేక్షకుడికి దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. నేను ఈ స్థాయిలో నిలబడటానికి, ఈ అవార్డు అందుకోవడానికి ముఖ్య కారణం ప్రేక్షక దేవుళ్లే. 48 ఏళ్లుగా నేను ఏ వేషం వేసినా, ఏ ప్రయోగం చేసినా మీరందించిన ప్రేమే నాకు ఈరోజు ఇంతటి గుర్తింపు తెచ్చింది.
నాలాంటి ఒక నటుడిని, మీ ఇంటి మనిషిలా ఆదరించి, "నటకిరీటి"ని చేసి, ఈ స్థాయికి తీసుకువచ్చింది మీ చప్పట్లే. ఆ ఋణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను. నన్ను ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండమని దీవించిన మీ అందరికీ మరోసారి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను’ అని రాజేంద్ర ప్రసాద్ వీడియోలో పేర్కొన్నారు.






