కొలువుదీరిన కాటన్ మిల్లర్స్ నూతన కమిటీ.. అధ్యక్షుడిగా బొమ్మినేని రవీందర్ రెడ్డి

by Ramesh Naini |

తెలంగాణ కాటన్​మిల్లర్స్​అండ్​ట్రేడర్స్​వెల్పేర్​అసోయేషన్​రాష్ట్ర అధ్యక్షులుగా బొమ్మినేని రవీందర్​రెడ్డి ఎన్నికైయ్యారు.

కొలువుదీరిన కాటన్ మిల్లర్స్ నూతన కమిటీ.. అధ్యక్షుడిగా బొమ్మినేని రవీందర్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ కాటన్​మిల్లర్స్​అండ్​ట్రేడర్స్​వెల్పేర్​అసోయేషన్​రాష్ట్ర అధ్యక్షులుగా బొమ్మినేని రవీందర్​రెడ్డి ఎన్నికైయ్యారు. ప్రధాన కార్యదర్శిగా కక్కిరాల రమేష్, కోశాధికారిగా పడిసెల కృష్ణ సంతోష్ ను​ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గత కమిటీకి రెండేళ్ల కాల పరిమితి కావడంతో ఆదివారం ఓ ప్రైవేటు రిసార్ట్​లో సమావేశం నిర్వహించి ఎన్నిక జరిగినట్లు ఎన్నికల అధికారి సిరిమల్ల నరేందర్ ​తెలిపారు. పత్తి కొనుగోలు సమయంలో మిల్లర్లకు సమస్యలు వస్తే త్వరగా పరిష్కారం చేసేందుకు కృషి చేస్తామని నూతన కమిటీ నాయకులు పేర్కొన్నారు.

Next Story