సైలెంట్‌గా నిశ్చితార్థం చేసుకున్న టాలీవుడ్ స్టార్స్.. పిక్స్ వైరల్

by Disha Web |
సైలెంట్‌గా నిశ్చితార్థం చేసుకున్న టాలీవుడ్ స్టార్స్.. పిక్స్ వైరల్
X

దిశ, సినిమా: కొంతకాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్న టాలీవుడ్ సెలెబ్రిటీస్ ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ తాజాగా నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారంటూ వచ్చిన రూమర్స్‌పై ఎప్పుడూ స్పందించని ఆది.. డైరెక్ట్ ఎంగేజ్మెంట్ ఫోటోలతో సమాధానం చెప్పాడు. ఇక ఈ నిశ్చితార్థం మార్చి 24న కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య జరిగినట్లు తెలుస్తుండగా.. ఇందుకు సంబంధించిన ఫొటోలను వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. 'మేము కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నాం. ఇప్పుడు ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తున్నాం. ఈ రోజు మా జీవితంలో ఎంతో ప్రత్యేకమైనది. ఈ కొత్త ప్రయాణంలో మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలు ఉంటాయని కోరుకుంటూ.. మా ఇద్దరి కుటుంబాల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నాం' అంటూ వివరించారు. ఇక త్వరలోనే ఈ జంట పెళ్లిపీఠలెక్కనున్నట్లు సమాచారం.



Next Story

Most Viewed