క్వార్టర్‌లో కారు బీభత్సం.. ధ్వంసమైన ద్విచక్ర వాహనం

by Disha Web Desk 2 |
క్వార్టర్‌లో కారు బీభత్సం.. ధ్వంసమైన ద్విచక్ర వాహనం
X

దిశ,గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని హనుమాన్‌నగర్‌లో ఓ కారు బీభత్సం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే.. హనుమాన్ నగర్‌లో ఇంటి ముందు పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనంతో పాటు వాటర్ పైప్ లైన్‌లను సైతం ధ్వంసం చేసుకుంటూ మద్యం మత్తులో ఓ యువకుడు కారుతో బీభత్సం సృష్టించాడు. అదే కాలనీకి చెందిన సదరు యువకుడు ఇష్టానుసారం వాహనం నడిపి స్థానికులను భయబ్రాంతులకు గురిచేశాడు. ఆ సమయంలో బయట పిల్లలు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ఎప్పుడు సింగరేణి క్వార్టర్స్ ముందు పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. ఈ ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

Next Story

Most Viewed