ఢిల్లీలో దారుణం.. ఒకే మహిళపై రెండుసార్లు సామూహిక అత్యాచారం

by Disha Web Desk 19 |
ఢిల్లీలో దారుణం.. ఒకే మహిళపై రెండుసార్లు సామూహిక అత్యాచారం
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీలో దారుణం జరిగింది. పని ముగించుకుని ఇంటికి వెళ్తు్న్న 26ఏళ్ల మహిళపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం.. పశ్చిమ ఢిల్లీలోని హరి నగర్ ప్రాంతంలో ఓ మహిళ ఒక కంపెనీలో పనిచేస్తోంది. అయితే మంగళవారం రాత్రి పని ముగియగానే ఇంటికి వెళ్తున్న క్రమంలో అదే కంపెనీలో గతంలో పనిచేసిన ఇద్దరు వ్యక్తులు ఆమెను మాట్లాడాలని అడ్డుకున్నారు. అనంతరం మహిళను ఓ పార్క్‌లోకి లాకెళ్లారు. పార్కులో మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

అంతటితో ఆగని కామాంధులు, ఆమెను వారు నివాసం ఉంటున్న గదికి తీసుకెళ్లారు. అక్కడ ఆ మహిళపై మరోసారి ఇద్దరు దారుణానికి ఒడిగట్టారు. వీరి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించిన బాధితురాలిని కొట్టి.. ఆమె ఫోన్ లాక్కు్న్నారు. రాత్రి మొత్తం మహిళను గదిలోనే ఉంచి.. తెల్లావారుజామున బాధితురాలిని పార్క్ వద్ద వదిలివెళ్లారు. దీనితో బాధితురాలు పోలీసులను ఆశ్రయించి జరిగిన దారుణాన్ని వారికి వివరించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed