ఘోర ప్రమాదం.. మూడేళ్ల బాలుడు దుర్మరణం

by Disha Web Desk 2 |
ఘోర ప్రమాదం.. మూడేళ్ల బాలుడు దుర్మరణం
X

దిశ, తుర్కపల్లి(ఎం): ప్రమాదవశాత్తు బైకులు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో మూడేళ్ల బాలుడు మృతి చెందడంతో పాటు ఇరువురికి తీవ్రగాయాలు అయ్యాయి. ఈ ఘటన తుర్కపల్లి మండలం పల్లెపహాడ్ గ్రామ శివారులోని చౌరస్తాలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. బొమ్మలరామారం మండలం బోయినపల్లి తండాకు చెందిన ధరావత్ దేవా, అతని కుమారుడు ధరావత్ అభిరామ్(3) బైకుపై వెళుతుండగా వెనకనుంచి బైకుపై వస్తున్న మాదాపూర్ గ్రామానికి చెందిన మహమ్మద్ హుస్సేన్ ఖాన్ అనే వ్యక్తి బలంగా ఢీకొట్టాడు.

ఈ ప్రమాదంలో ముందు వెళ్తున్న ధరావత్ దేవాకు తీవ్ర గాయాలు కాగా, అతని కుమారుడు అభిరామ్ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. అంతేగాక, వెనకాల నుంచి ఢీకొట్టిన మహమ్మద్ హుస్సేన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గ్రామస్తుల సమాచారం మేరకు తుర్కపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన బాలుడు అభిరామ్‌ను పోలీసు వాహనంలో పోస్టుమార్టానికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న తుర్కపల్లి ఎస్ఐ మధు బాబు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.



Next Story

Most Viewed