న్యాయం కోసం సెల్ టవర్ ఎక్కిన రిపోర్టర్.. స్థానికంగా సంచలనం రేపిన ఘటన..

by Disha Web Desk 19 |
న్యాయం కోసం సెల్ టవర్ ఎక్కిన రిపోర్టర్.. స్థానికంగా సంచలనం రేపిన ఘటన..
X

దిశ, బాన్సువాడ: న్యాయం కోసం ఓ రిపోర్టర్ సెల్ టవర్ ఎక్కిన ఘటన నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలో చోటు చేసుకుంది. బాధితుడి బంధువుల వివరాల ప్రకారం.. రూద్రూర్ మండలంలోని అంబం గ్రామానికి చెందిన శానం సాయిలు వర్ని మండల రిపోర్టర్‌గా పని చేస్తున్నాడు. అయితే, గత కొన్నేళ్ళుగా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, మూడెకరాల పొలం ఇవ్వాలని స్థానిక నాయకులను కోరుతున్నాడు. అర్హత ఉన్నప్పటికీ, తనను లబ్ధిదారుడిగా ఎంపిక చేయడం లేదని ఆవేదన చెందుతున్నాడు. ఈ విషయమై రెవెన్యూ అధికారులు, అసెంబ్లీ స్పీకర్ పోచారం తనయులకు మొర పెట్టుకున్నారు. అయిన న్యాయం జరగకపోవడంతో అధికార యంత్రాగంపై విరక్తి చెంది.. సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. కాగా, ఈ విషయం స్థానికంగా సంచలనం రేపింది. సాక్షాత్తు ఓ రిపోర్టర్ సెల్ టవర్ ఎక్కడానికి కారణమైన పరిస్థితులపై ప్రజలు చర్చించుకున్నారు.



Next Story

Most Viewed