పెళ్లయి నాలుగేళ్లయినా సంతానం లేదు.. రాత్రికి భర్త ఇంట్లో లేకపోవడంతో

by Disha Web |
పెళ్లయి నాలుగేళ్లయినా సంతానం లేదు.. రాత్రికి భర్త ఇంట్లో లేకపోవడంతో
X

దిశ, అమరచింత: ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన వనపర్తి జిల్లా అమరచింత మున్సిపల్ కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. దాసరి పల్లి గ్రామానికి చెందిన సురేఖ (23) అమరచింత మున్సిపాలిటీ కేంద్రంలోని శ్రీ కృష్ణ నగర్‌కు చెందిన మధుతో 4 ఏళ్ల క్రితం పెద్దల సమక్షంలో వివాహం జరిగింది.

భర్త మధు డ్రైవర్ కావడంతో నిన్న రాత్రి చెరుకు ట్రాక్టర్ నడిపేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో సురేఖ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య పాల్పడినట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఆమెకు సంతానం కాలేదని, అదే కారణంతో బలవన్మరణానికి పాల్పడి ఉండవచ్చునని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసులు విచారణ అనంతరం తెలియాల్సివుంది.

Next Story

Most Viewed