బొంరాస్ పేట్‌లో అదృశ్యం.. మాదారం గ్రామంలో మృతదేహం

by Disha Web Desk 13 |
బొంరాస్ పేట్‌లో అదృశ్యం.. మాదారం గ్రామంలో మృతదేహం
X

దిశ, పరిగి: తాగుడుకు బానిసై బొంరాస్​పేట్​వాసి పరిగి మండలం మాదారం గ్రామంలో మృతి చెందాడు. పరిగి ఎస్​ఐ పి.విఠల్​రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పరిగి మండలం పెద్ద మాదారం గ్రామంలో ఆదివారం ఓ గుర్తు తెలియని వ్యక్తి శవం ఉందని స్థానికుడు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఎస్​ఐ విఠల్​రెడ్డి తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహం బోర్లాపడి నలుపు, నీలిరంగులోకి మారి మృతదేహాన్ని పరిశీలించారు. పరిసర ప్రాంతాల్లో గాలించగా ఓ పర్సు లభించి అందులో ఫోటో, ఆధార్​ కార్డు దొరికింది. ఆధార్ కార్డు ఆధారంగా మృతుడు బొంరాస్ పేట్ గ్రామానికి చెందిన మంగలి వెంకటయ్య(52)గా గుర్తించారు. కుటుంబీకులకు సమాచారం అందించగా చనిపోయింది మంగళి వెంకటయ్య మా నాన్ననే అని మంగళి మల్లేష్​మృతదేహాన్ని గుర్తించి చెప్పాడు.


కాగా మంగలి వెంకటయ్య కొంతకాలం క్రితం తన భార్యను చంపి జైలుకు వెళ్లి బెయిల్​పై బయటికి వచ్చాడని తెలిపాడు. అప్పటి నుంచి తాగుడుకు మరింత బానిసై ఇంట్లో ఉండకుండా 15 రోజుల నుంచి కనిపించకుండా వెళ్లినట్లు తెలిపారు. బొంరాస్​పేట్ పరిసర ప్రాంతాల్లో గాలిస్తున్నామని ఇలా మృతి చెందడం బాధకరమని రోధించాడు. మృతుడి కుమారుడు మల్లేష్​ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్​ఐ విఠల్​రెడ్డి తెలిపారు.

Next Story

Most Viewed