కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఆరుగురు కార్మికులు మృతి

by Disha Web Desk 12 |
కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఆరుగురు కార్మికులు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించి ఆరుగురు కార్మికులు మృతి చెందారు. ఈ సంఘటన గుజరాత్‌లోని భరూచ్ జిల్లాల్లో సోమవారం జరిగింది. అహ్మదాబాద్ కు 235 కిలోమీటర్ల దూరంలోని దహేజ్ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న యూనిట్‌లో తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. రియాక్టర్ వద్ద కార్మికులు పనిచేస్తున్న సమయంలో అకస్మాత్‌గా మంటలు చెలరేగి పేలుడు సంభవించినట్లు.. భరూచ్ పోలీసులు తెలిపారు.

పేలుడు కారణంగా ఫ్యాక్టరీ మొత్తం మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో రియాక్టర్ వద్ద పనిచేస్తున్న ఆరుగురు కార్మికులు మంటల్లో చిక్కుకొని మరణించారు. మంటలు ఆర్పిన అనంతరం మృతదేహాలను వెలికి తీసిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ కు తరలించినట్లు పెర్కోన్నారు. ఈ ప్రమాదంలో మరెవరికి గాయాలు కూడా కాలేదని తెలుస్తోంది.

Next Story

Most Viewed