సరికొత్త సంప్రదాయానికి నాంది.. ఆ గ్రామంలో ఆడబిడ్డల ఆత్మీయ సమ్మేళనం

by Batti.Sumithra |

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం దేవక్కపల్లి గ్రామంలో మూడు తరాల ఆడబిడ్డలు ఒకే చోట చేరి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.

సరికొత్త సంప్రదాయానికి నాంది.. ఆ గ్రామంలో ఆడబిడ్డల ఆత్మీయ సమ్మేళనం
X

దిశ, బెజ్జంకి : సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం దేవక్కపల్లి గ్రామంలో మూడు తరాల ఆడబిడ్డలు ఒకే చోట చేరి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. పెళ్లిళ్లతో వివిధ ప్రాంతాలకు వెళ్లిపోయిన వారు పుట్టిన ఊరికి చేరి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. పోచమ్మ ఆలయంలో పూజలు చేసి, ఆటపాటలతో సందడి చేశారు. ఈ కార్యక్రమం మహిళల మధ్య బంధాలను బలపరుస్తూ, పుట్టింటితో అనుబంధం ఎప్పటికీ నిలుస్తుందనే సందేశాన్ని ఇచ్చింది. గ్రామస్తులు ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ, ప్రతి ఊరిలోనూ ఇలాంటి సమ్మేళనాలు జరగాలని కోరుకున్నారు.

Next Story