10వ తరగతి బాలికపై గ్యాంగ్ రేప్.. నిందితుల్లో ఓ ఎమ్మెల్యే కుమారుడు..?

by Disha Web Desk 19 |
10వ తరగతి బాలికపై గ్యాంగ్ రేప్.. నిందితుల్లో ఓ ఎమ్మెల్యే కుమారుడు..?
X

దిశ, వెబ్‌డెస్క్: రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో దారుణం జరిగింది. ఓ 10వ తరగతి బాలికపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఓ 15ఏళ్ల బాలిక 10వ తరగతి చదువుతోంది. ఆమెకు అల్వార్ ప్రాంతానికి చెందిన వివేక్ శర్మ అనే యువకుడితో పరిచయం ఉంది. ఓ రోజు వివేక్ శర్మ ఆ బాలికకు మత్తు మందు ఇచ్చి.. ముందావర్ రోడ్డులోని ఓ హోటల్‌కు తీసుకెళ్లాడు. అనంతరం అక్కడ అతడి స్నేహితులతో కలిసి ఆ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారం చేసిన యువకులలో రాజ్‌గఢ్ ఎమ్మెల్యే జోహరీ లాల్ మీనా కుమారుడు దీపక్ మీనా కూడా ఉన్నట్లు సమాచారం.

కాగా, ఈ దుర్మార్గాన్ని చిత్రికరించిన యువకులు.. బాలికను భయపెట్టి పలుమార్లు అదే హోటల్‌కు పిలిచి అత్యాచారానికి ఒడిగట్టారు. దీనితో బాలిక ఆరోగ్యం క్షీణించింది. బాలిక తల్లి ఏమైందని గట్టిగా ప్రశ్నించడంతో.. వెంటనే బాలిక జరిగిన విషయం మొత్తం తల్లికి చెప్పింది. తనను బ్లాక్ మెయిల్ చేసి.. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని వాపోయింది. వెంటనే బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే కుమారుడితో సహా ఐదుగురు బాలురపై కేసు నమోదు చేసినట్లు ఈ కేసు దర్యాప్తు అధికారి బ్రజేష్ కుమార్ తెలిపారు.

Next Story

Most Viewed