విద్యుద్ఘాతంతో రైతు మృతి..

by Disha Web Desk 13 |
విద్యుద్ఘాతంతో రైతు మృతి..
X

దిశ, లింగాల: నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండల పరిధిలోని చెన్నంపల్లి గ్రామానికి చెందిన ఓ రైతు విద్యుద్ఘాతంతో మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఎస్ఐ రవి కథనం ప్రకారం.. పసుపుల ఆంజనేయులు(35) తన రెండు ఎకరాల వ్యవసాయ పొలంలో వేరుశనగ పంటలో స్టార్టర్ బాక్స్ ఆఫ్ చేయడానికి వెళ్లి స్టార్టర్ బాక్స్ లో కరెంటు వైర్లు ఉండడంతో ప్రమాదవశాత్తు కరెంటు వైర్లకు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించినట్లు వారు తెలిపారు. అతని భార్య చిట్టమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రవి తెలిపారు.



Next Story

Most Viewed