డబ్బులు ఇవ్వడానికి వెళ్లిన వ్యక్తి.. చెట్టు కింద అలా చూసి షాకైన కొడుకు!

by Disha Web Desk 19 |
డబ్బులు ఇవ్వడానికి వెళ్లిన వ్యక్తి.. చెట్టు కింద అలా చూసి షాకైన కొడుకు!
X

దిశ, పరిగి: కూలీలకు డబ్బులు ఇచ్చి వస్తానని ఇంటి నుంచి వెళ్లిన ఓ రైతు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పరిగి ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్​జిల్లా పరిగి మండలం రంగంపల్లి గ్రామానికి చెందిన పిచ్చకుంట్ల చంద్రయ్య (42) తన పొలంలో పని చేయించుకున్న కూలీలకు డబ్బులివ్వాలని శుక్రవారం సాయంత్రం ఇంటి నుంచి పొలానికి వెళ్లాడు. అయితే, శుక్రవారం రాత్రి ఇంటి నుంచి డబ్బులు తీసుకొని వెళ్లి శనివారం ఉదయం అయినా ఇంటికి రాలేదు. దీనితో చంద్రయ్య కుమారుడు తమ పొలం వద్ద నుంచి సొండేపూర్​శివారులోని పొలాల వద్ద వెతికగా.. అతడికి మర్రిచెట్టు సమీపంలో ఓ మృతదేహం కనిపించింది. దగ్గరకు వెళ్లి చూసి చనిపోయింది తన తండ్రేనని నిర్ధారించుకుని బోరున విలపిస్తూ కుటుంబీకులకు, గ్రామస్తులకు, పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే పరిగి ఎస్ఐ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చనిపోయిన చంద్రయ్య గొంతుతోపాటు అక్కడక్కడ కమిలిన గాయాలు ఉన్నాయి. దీంతో ఎవరో కొట్టి హత్య చేసి ఉంటారని మృతుడి భార్య అరుణమ్మ అనుమానం వ్యక్తం చేసింది. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు.

Next Story

Most Viewed