ఆయనపై కేసు నమోదు.. ఆందోళనకారులకు నచ్చచెప్పకుండా ఈడ్చుకెళ్తున్నారు..

by Disha Web Desk 13 |
ఆయనపై కేసు నమోదు.. ఆందోళనకారులకు నచ్చచెప్పకుండా ఈడ్చుకెళ్తున్నారు..
X

దిశ, ఖమ్మం రూరల్: ఖమ్మం నగరం 59 వ డివిజన్​కు చెందిన మాజీ కార్పొరేటర్, టీఆర్‌ఎస్​నాయకుడు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుచరుడైన జంగం భాస్కర్​ పై గురువారం రాత్రి రూరల్​పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు తుమ్మల అనుచరులు.. భాస్కర్​భార్య కల్పనతో కలిసి రూరల్ పోలీస్​స్టేషన్​ముందు జంగం భాస్కర్​పై అక్రమంగా పోలీసులు కేసు నమోదు చేసి, ఎక్కడికో తరలించారని వెంటనే విడుదల చేయాలని, నా భర్త అడ్రస్ చెప్పాలంటూ ఆందోళన చేపట్టారు.


ఇంతలో రూరల్​ఏసీపీ బస్వారెడ్డి వచ్చి ఆందోళనకారులకు నచ్చజెప్పకుండా.. వారిపై విరుచుకు పడటంతో పాటు.. టీఆర్‌ఎస్​నాయకుడు జొన్నలగడ్డ రవి, భాస్కర్​భార్య కల్పనలను పోలీసులు ఈడ్చుకెళ్లారు. మద్దతుదారులు ఏకమై అక్రమ అరెస్టులను ఖండించాలని నినాదాలు చేయడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు భారీగా మోహరించారు.

అసలేం జరిగింది..

ఖమ్మం రూరల్​పోలీస్​స్టేషన్​లో జంగం భాస్కర్​ పై బెదిరింపుల కేసు నమోదైంది. భాస్కర్​రూరల్​మండలం నాయడుపేటకు చెందిన టీఆర్‌ఎస్ నాయకుడు.. మేకల ఉదయ్​కు ఫోన్​చేసి అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు బెదిరించినట్లు రూరల్​పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు జంగం భాస్కర్​ పై కేసు నమోదు చేసేందుకు మధ్యాహ్నం స్టేషన్​కు పిలిపించారు.


భాస్కర్​ను రాత్రి అయిన బయటకు పంపక పోయేసరికి తుమ్మల అనుచరులైన తమ్మినేని క్రిష్ణయ్య, జొన్నలగడ్డ రవి, బండి జగదీశ్, శాఖమూరి రమేష్ లు స్టేషన్​కు వచ్చి పోలీసులతో మాట్లాడి వెళ్లారు. ఈ లోపు భాస్కర్​మాయమైనట్లు, పోలీసులే ఎక్కడికో తరలించారని వార్త బయటకు రావడంతో స్టేషన్​కు అర్ధరాత్రి పెద్ద సంఖ్యలో ఆయన అనుచరులు చేరుకోవడంతో ఉద్రిక్తతకు దారితీసింది.

40 మంది తుమ్మల మద్ధతుదారులపై కేసు నమోదు..

ఇది ఇలా ఉండగా గురువారం అర్ధరాత్రి ఆందోళన చేపట్టిన సంఘటనలో తుమ్మల వర్గానికి చెందిన 40 మంది టీఆర్‌ఎస్​నాయకులపై కేసు నమోదు చేశారు. ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించారని, పోలీసులను దుర్భాషలాడారని తదితర అభియోగాలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్​ఐ శంకర్​రావు తెలిపారు.

Next Story