ఘోర ప్రమాదం.. జన సమూహంపైకి దూసుకొచ్చిన కారు

by Disha Web Desk 12 |
ఘోర ప్రమాదం.. జన సమూహంపైకి దూసుకొచ్చిన కారు
X

బ్రసెల్స్: బెల్జియంలో అతివేగంతో దూసుకొచ్చిన కారు బీభత్సం సృష్టించింది. ఆదివారం తెల్లవారుజామున జన సమూహం పైకి కారు దూసుకెళ్లిన ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. పదుల సంఖ్యలో గాయపడినట్లు అధికారులు తెలిపారు. కార్నివాల్ కి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు వెల్లడించారు. బెల్జియం కాలమానం ప్రకారం ఉదయం 5 గంటలకు ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. ప్రాథమిక దర్యాప్తులో కారు అతివేగమే కారణమని నిర్ధారణకు వచ్చినట్లు తెలిపారు.

కేసు ప్రాథమిక విచారణలో గుంపుగా ఉన్న వ్యక్తులపై కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురు చనిపోగా 26 మంది గాయపడ్డారు. వీరిలో మరో 10 మంది పరిస్థితి తీవ్రంగా ఉంది అని తెలిపారు. ప్రధాన నిందితులుగా అనుమానిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. అయితే ఈ ఘటనలో ఉగ్రవాద ప్రేరేపిత చర్య లేదని అన్నారు. ఈ ఘటనపై బెల్జియం ప్రధాని అలెగ్జాండర్ డి క్రూ భయంకరమైన ప్రమాదం గా పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు ట్విట్టర్ ద్వారా సానుభూతి తెలియజేశారు.



Next Story