కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో 5.75 కేజీల గంజాయి పట్టివేత

by Batti.Sumithra |

కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో గంజాయిని తరలిస్తున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు హైదరాబాద్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.

కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో 5.75 కేజీల గంజాయి పట్టివేత
X

దిశ, సికింద్రాబాద్ : కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో గంజాయిని తరలిస్తున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు హైదరాబాద్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో అనుమానాస్పదంగా ఉన్న ఓ బ్యాగును పరిశీలించగా, అందులో 5.75 కిలోల గంజాయి లభ్యమైంది. అయితే, ఆ బ్యాగును అక్కడ వదిలివెళ్లిన వ్యక్తులను గుర్తించలేకపోవడంతో అధికారులు అన్‌క్లెయిమ్డ్ ప్రాపర్టీ కేసుగా నమోదు చేశారు. అనంతరం స్వాధీనం చేసుకున్న గంజాయిని తదుపరి చర్యల కోసం సికింద్రాబాద్ ఎక్సైజ్ స్టేషన్‌కు అప్పగించారు.

Next Story