- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కోటపల్లిలో ఆ పని.. 28 మంది అరెస్ట్
by Dishanational1 |
X
దిశ, కోటపల్లి: మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దు ప్రాణహిత పరివాహక అటవీ ప్రాంతంలో రహస్యంగా కోడి పందాలు నిర్వహిస్తున్న స్థావరాలపై రామగుండం టాస్క్ ఫోర్స్, కోటపల్లి పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు. ఈ దాడిలో 28 మంది పందెంరాయుళ్లతోపాటు నాలుగు కోళ్లు, 5 కత్తులు,7 వాహనాలు, రూ. లక్షా 51 వేల నగదుతోపాటు 26 సెల్ ఫోన్స్ ను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఇందులో పట్టుబడినవారంతా పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలకు చెందినవారు ఉన్నారన్నారు. ఈ పందెం రాయుళ్లు మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దు ప్రాంతాలలో పోలీసుల నుండి తప్పించుకోవడానికి స్థావరాలను ఎప్పటికప్పుడు మారుస్తూ పందాలను నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ దాడుల్లో సీఐ మహేందర్, ఎస్సై లచ్చన్న, సిబ్బంది సంపత్ కుమార్, భాస్కర్ గౌడ్, శ్రీనివాస్, రాకేష్, శ్యామ్ సుందర్, కోటపల్లి పోలీసులు పాల్గొన్నారు.
Next Story