కరెంట్ షాక్ తో 25 గొర్రెలు మృతి

by Disha Web Desk 12 |
కరెంట్ షాక్ తో 25 గొర్రెలు మృతి
X

దిశ, చింతకాని: మేతకు వెళ్లిన గోర్రెలు కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే 25 గొర్రెలు మృతి చెందాయి. ఈ ఘటన జగన్నాధపురం లో జరిగింది. వివరాల్లోకి వెళితే చింతకాని మండలం జగన్నాధపురం గ్రామానికి చెందిన గొర్రెల కాపరులకు చెందిన 25 గొర్రెలు మున్నేరులో మేతకు వెళ్లాయి. అయితే అక్కడ అక్రమంగా ఏర్పాటు చేసిన వ్యవసాయ విద్యుత్ మోటార్ కి కరెంట్ రావడంతో మొత్తం గొర్రెలు కరెంట్ షాక్ తగిలి మరణించాయి. గొర్రెల కాపరులకు తగిన న్యాయం చేయాలని మండల కాంగ్రెస్ డిమాండ్ చేసింది.



Next Story