హత్యకేసులో మధ్యప్రదేశ్ స్థానిక కోర్టు సంచలన తీర్పు

by Disha Web Desk 13 |
హత్యకేసులో మధ్యప్రదేశ్ స్థానిక కోర్టు సంచలన తీర్పు
X

భోపాల్: హత్య కేసులో మధ్యప్రదేశ్ మోరెనా జిల్లాలోని కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఒకే కుటుంబానికి చెందిన 10 మందికి జీవిత ఖైదు విధించింది. అంతేకాకుండా ఒక్కొక్కరిపై రూ.4 వేల జరిమానా విధించింది. 12 ఏళ్ల క్రితం ఓ వ్యక్తి దారుణ హత్యకేసులో కోర్టు విచారణ చేపట్టింది. చాలా కాలంగా ఉన్న పాత కక్షలతో బాధితుడు శివకుమార్‌పై నిందితులు దాడికి ప్రణాళిక వేశారు. అతను షాప్ నుంచి తిరిగివస్తుండగా పలు ఆయుధాలతో చుట్టుముట్టి హతమార్చారు. ఈ ఘటనపై కుటుంబాన్ని బాధ్యులుగా చేస్తూ కేసు నమోదు చేశారు. దీనిపై విచారించిన కోర్టు కుటుంబంలోని 10 మందికి జీవిత ఖైదు విధిస్తున్నట్లు సంచలన తీర్పు నిచ్చింది.


Next Story

Most Viewed