తెలుగు ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి.. చంద్రబాబు

by  |
babu
X

దిశ, ఏపీ బ్యూరో: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ‘చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దీపావళి. దీపావళి అంటే దీపాల వరుస అని అర్ధం. చీకట్లను పారద్రోలి.. ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు వెల్లివిరిసేది దీపావళి. సరదాలు, సంబరాలు, దీపాల వెలుగులు, బాణాసంచాల జిలుగులతో కుటుంబాలు సంతోషాలతో వెల్లివిరియాలి. దీపావళి అంటేనే కాంతులు నింపే పండుగ. అందరూ సుఖ సంతోషాలతో జీవించాలి. సిరి సంపదలు, సౌభాగ్యం, స్నేహం ఎల్లప్పుడు వెల్లివిరియాలని కోరుకుంటూ కోటి కాంతుల చిరునవ్వులతో జీవితాంతం సుఖ సంతోషాలతో ఉండాలని ఆశిస్తూ తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలందరికీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు’ అని చంద్రబాబు ట్విటర్ లో తెలియజేశారు.

Next Story

Most Viewed