- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: డిఫెన్స్ చీఫ్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం యావత్ భారత దేశాన్ని విషాదంలోకి నెట్టింది. ఏకంగా డిఫెన్స్ చీఫ్ మరణవార్త సామాన్య పౌరుడి నుంచి ప్రధాన మంత్రిని దిగ్భ్రాంతికి గురిచేసింది. లోక్ సభ సమావేశాలను కూడా వాయిదా వేశారు. ఇక ఇదే హెలికాప్టర్ ప్రమాదంలో తెలుగు జవాన్ సాయితేజ్ తుదిశ్వాస విడిచాడు. లాన్స్నాయక్ సాయితేజ్ చిత్తూరు జిల్లా కురబలకోటకు చెందినవాడు. సాయితేజ్ మరణవార్తతో కురబలకోట చిన్నబోయింది. బాధిత కుటుంబ సభ్యులకు నాయకులు, ప్రజలు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. దేశ సేవలో ప్రాణం విడిచిన సాయితేజ ఆత్మకు శాంతి చేకూర్చాలని దేవున్ని ప్రార్థిస్తున్నారు.
- Tags
- Helicopter Crash
Next Story