నాకు ఎవరి నుంచి త్రెట్ ఉందో చెప్పాలి: రాజాసింగ్

by  |
నాకు ఎవరి నుంచి త్రెట్ ఉందో చెప్పాలి: రాజాసింగ్
X

దిశ, వెబ్ డెస్క్: నాకు ఎవరి నుంచి త్రెట్ ఉందో చెప్పాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పోలీసులను డిమాండ్ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అడిషనల్ డీసీపీ నిన్న వచ్చి.. చుట్టుపక్కల ఎవరెవరు ఉంటారని ఆరా తీశారని, తన గన్‌మెన్ గన్స్ కూడా మార్చారని ఆయన చెప్పారు. దీన్ని బట్టి చూస్తే తనకు త్రెట్ ఉన్నట్లుగా అర్థమైతోందని, అయితే, తనకు ఎవరి నుంచి త్రెట్ ఉందో చెప్పాలని ఆయన పోలీసులను డిమాండ్ చేశారు. టెర్రిస్టుల నుంచి ఉందా? లేక స్థానిక సంస్థల నుంచి ఉందా? అనేది తనకు స్పష్టం చేయాలన్నారు. ఈ విషయమై కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీకి తాను లేఖలు రాస్తానన్నారు.



Next Story

Most Viewed