కలకలం రేపిన నేపాలీ జంట.. టెలికాం నగర్‌లో భారీ దొంగతనం

by  |
Telikam Nagar
X

దిశ, శేరిలింగంపల్లి: పనిచేస్తున్న ఇంటికే కన్నం వేసిన ఓ జంట భారీ ఎత్తున బంగారం, రూ.10లక్షల నగదుతో పరారయ్యారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… గచ్చిబౌలిలోని టెలికాంనగర్ ప్లాట్‌ నెంబర్ 264లో బీరం గోవిందరావు కుటుంబంతో నివాసం ఉంటున్నారు. వీరి ఇంట్లో నేపాల్‌కు చెందిన భార్యభర్తలు లక్ష్మణ్, పవిత్రలు పనిచేస్తున్నారు. ఈనెల 18న గోవిందరావు కుటుంబంతో కలిసి శ్రీశైలం దేవాలయానికి వెళ్లారు.

ఆదివారం తిరిగి ఇంటికి రాగా కిటికీ గ్రిల్ తీసి ఉంది. అంతేగాకుండా.. బెడ్ రూమ్ తాళం పగిలి, డోర్ ఓపెన్ చేసి ఉంది. బెడ్‌ రూమ్‌‌లో ఉన్న తాళం సహాయంతో గోద్రెజ్ లాకర్‌ను తెరిచి అందులో ఉన్న 110 తులాల బంగారు ఆభరణాలు, రూ.10 లక్షల నగదును తీసుకెళ్లారు. దీంతో వారికి ఇంట్లో పనిచేస్తున్న నేపాల్ జంటపై అనుమానం వచ్చి వెతకడం ప్రారంభించగా, వారు అప్పటికే కనిపించకుండా పోయారు. దీంతో చేసేదేంలేక స్థానిక రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Next Story