కీలక దశకు చేరుకున్న కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ!

by Disha Web Desk 2 |
కీలక దశకు చేరుకున్న కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ!
X

దిశ, డైనమిక్ బ్యూరో: అభ్యర్థుల ఎంపికపై తెలంగాణ కాంగ్రెస్ కసరత్తు వేగవంతం చేసింది. టికెట్ల కోసం వచ్చిన దరఖాస్తులపై ఇవాళ ఎలక్షన్ కమిటీ మీటింగ్‌లో నేతలు చర్చించనున్నారు. పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చిన నేపథ్యంలో ప్రతి నియోజకవర్గానికి వచ్చిన 10 అప్లికేషన్లలో 4-5 దరఖాస్తులను ఎన్నికల కమిటీ పరిశీలించిన అనంతరం స్క్రీనింగ్ కమిటీకి పంపనుంది. మిగతా 5 దరఖాస్తులను ఎలిమినేట్ చేయనున్నారు. వీటితో పాటు ఏకాభిప్రాయం ఉన్న 25 నియోజకవర్గాలకు సంబంధించిన దరఖాస్తులను సైతం స్క్రీనింగ్ కమిటీకి పంపనున్నారు. ఎటువంటి వివాదాలు లేకుంటా ఇద్దరు మాత్రమే పోటీ ఉన్న దాదాపు 30 నియోజకవర్గాలను సైతం ఎన్నికల కమిటీ ఎంపిక చేసి అభ్యర్థులను ఖరారు చేయబోతున్నట్లు తెలుస్తోంది.



Next Story