- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > Telangana Assembly Election 2023 > రైతులు ఆందోళన చెందొద్దు.. పది రోజుల్లో ఖాతాల్లో డబ్బులు వేస్తాం: రేవంత్
రైతులు ఆందోళన చెందొద్దు.. పది రోజుల్లో ఖాతాల్లో డబ్బులు వేస్తాం: రేవంత్
రైతుబంధు పంపిణీకి ఎన్నికల సంఘం అనుమతి నిరాకరించడంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు.

X
దిశ, వెబ్డెస్క్: రైతుబంధు పంపిణీకి ఎన్నికల సంఘం అనుమతి నిరాకరించడంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ‘రైతుబంధుతో ఓట్లు దండుకోవాలన్న దురాశ, ఆత్రుత, అహంకారం తప్ప, నిజంగా రైతులకు మేలు జరగాలన్న ఉద్దేశం మామా - అల్లుళ్ల(కేసీఆర్, హరీష్ రావు)కు లేదు. హరీష్ రావు వ్యాఖ్యల కారణంగానే రైతుబంధుకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంటున్నట్టు ఈసీ ఆదేశాలు ఇవ్వడం దీనికి నిదర్శనం. ఈ ద్రోహులను ఇంటికి పంపితే తప్ప రైతులకు న్యాయం జరగదు. రాష్ట్రంలో రైతులు ఆందోళన చెందవద్దు. పది రోజుల్లో కాంగ్రెస్ రాగానే రూ.15 వేల రైతు భరోసా మీ ఖాతాల్లో వేస్తాం’ అని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.
Next Story






