రైతులు ఆందోళన చెందొద్దు.. పది రోజుల్లో ఖాతాల్లో డబ్బులు వేస్తాం: రేవంత్

by Disha Web Desk 2 |
రైతులు ఆందోళన చెందొద్దు.. పది రోజుల్లో ఖాతాల్లో డబ్బులు వేస్తాం: రేవంత్
X

దిశ, వెబ్‌డెస్క్: రైతుబంధు పంపిణీకి ఎన్నికల సంఘం అనుమతి నిరాకరించడంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ‘రైతుబంధుతో ఓట్లు దండుకోవాలన్న దురాశ, ఆత్రుత, అహంకారం తప్ప, నిజంగా రైతులకు మేలు జరగాలన్న ఉద్దేశం మామా - అల్లుళ్ల(కేసీఆర్, హరీష్ రావు)కు లేదు. హరీష్ రావు వ్యాఖ్యల కారణంగానే రైతుబంధుకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంటున్నట్టు ఈసీ ఆదేశాలు ఇవ్వడం దీనికి నిదర్శనం. ఈ ద్రోహులను ఇంటికి పంపితే తప్ప రైతులకు న్యాయం జరగదు. రాష్ట్రంలో రైతులు ఆందోళన చెందవద్దు. పది రోజుల్లో కాంగ్రెస్ రాగానే రూ.15 వేల రైతు భరోసా మీ ఖాతాల్లో వేస్తాం’ అని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.



Next Story

Most Viewed