కొడంగల్‌లో రేవంత్.. సిరిసిల్లలో కేటీఆర్

by Disha Web Desk 2 |
కొడంగల్‌లో రేవంత్.. సిరిసిల్లలో కేటీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉత్కంఠంగా సాగుతోంది. దాదాపు మెజార్టీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ముందంజలో కొనసాగుతుండగా.. రెండో స్థానంలో బీఆర్ఎస్, మూడు, నాలుగో స్థానాల్లో బీజేపీ, ఎమ్ఐఎమ్ పార్టీలు కొనసాగుతున్నాయి. ఇక కొడంగల్‌లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ ముందంజలో కొనసాగుతోంది. మధిరలో భట్టి విక్రమార్క, పాలేరులో పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు, సిద్దపేటలో హరీశ్ రావు, నల్లగొండలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మునుడోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముందంజలో కొనసాగుతున్నారు.


Next Story