- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాబోయే ఎన్నికల్లో బలమైన శక్తిగా కాంగ్రెస్: కోదండరామ్
ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ విమర్శించారు. మూడేళ్లు పూర్తి కాకముందే కాళేర్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ కుంగిపోవడం కేసీఆర్ దోపిడీకి నిదర్శనమన్నారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ విమర్శించారు. మూడేళ్లు పూర్తి కాకముందే కాళేర్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ కుంగిపోవడం కేసీఆర్ దోపిడీకి నిదర్శనమన్నారు. కాళేశ్వరం కుంగినట్లే రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ సర్కార్ కుంగిపోవడం ఖాయమన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఎన్నికల ప్రచారంలో కోదండరామ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాలను కేసీఆర్ మోసం చేశారని 1.90 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా వాటిని భర్తీ చేసేందుకు ఈ ముఖ్యమంత్రికి సమయం దొరకలేదని దుయ్యబట్టారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలమైన శక్తిగా అవతరించబోతున్నదని చెప్పుకొచ్చారు.
Next Story






