టికెట్ల కేటాయింపు వేళ భట్టి విక్రమార్కతో కీలక నేతల భేటీ

by Disha Web Desk 2 |
టికెట్ల కేటాయింపు వేళ భట్టి విక్రమార్కతో కీలక నేతల భేటీ
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో బీసీలకు కనీసం 40 సీట్లు ఇప్పించాలని ఆ సామాజిక వర్గ నేతలు సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను కోరారు. అప్పుడే కాంగ్రెస్ పార్టీ సులువుగా అధికారంలోకి వస్తుందని అభిప్రాయాలను వ్యక్తం చేశారు. సోమవారం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నివాసంలో టీపీసీసీ బీసీ నేతలు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో రెండు అసెంబ్లీ స్థానాలకు తగ్గకుండా బీసీ అభ్యర్థులను కేటాయించాలని కోరుతూ వినతిపత్రాన్ని అందజేశారు.

స్క్రీనింగ్ కమిటీ, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ అభ్యర్థుల ఫిల్టర్ తర్వాత 57 మంది బీసీ అభ్యర్థులు తేలారని, వీరిలో 40 మందికి తగ్గకుండా టికెట్లు ఇస్తే అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి మేలు జరుగుతుందని వివరించారు. జనాభా తమాషా ప్రకారం అన్ని రాజకీయ పార్టీలకు బీసీల ఓట్లే కీలకం అనే అంశాన్ని గుర్తుచేశారు. హైకమాండ్‌తో ప్రత్యేకంగా మాట్లాడి సీట్లు ఇప్పించాలని బీసీ నేతలు భట్టిని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, కత్తి వెంకటస్వామి, తదితరులు పాల్గొన్నారు.

More News : కాంగ్రెస్ ఫస్ట్ లిస్టులో కనిపించని కీలక నేతల పేర్లు.. రియాక్షన్ ఇదే!

Advertisement

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Read Disha E paper
👉 Follow us on Google News
👉 Follow us on whatsapp channel



Next Story

Most Viewed