రామోజీ రావును కలిసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

by Disha Web Desk 2 |
రామోజీ రావును కలిసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీ రావును కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కలిశారు. సోమవారం హైదరాబాద్‌లోని రామోజీరావు నివాసంలో మర్యాదపూర్వకంగా ఇరువురు భేటీ అయ్యారు. ఈ విషయాన్ని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ట్విట్టర్ వేదికగా తెలిపారు. కాగా, ఇటీవలే బీజేపీ నుంచి సొంత గూటికి చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్ఠానం మళ్లీ మునుగోడు టికెట్ కేటాయించిన సంగతి తెలిసిందే. రెండోసారి విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో రాజగోపాల్ రెడ్డికి ఆ స్థానం కేటాయించారు.


Next Story