తెలంగాణలో కాంగ్రెస్ కంటే టీడీపీ బలంగా ఉంది: కాసాని

by Disha Web Desk 2 |
తెలంగాణలో కాంగ్రెస్ కంటే టీడీపీ బలంగా ఉంది: కాసాని
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో కాంగ్రెస్ కంటే టీడీపీ బలంగా ఉందని.. ఇప్పటికే 30 మంది అభ్యర్థులతో లిస్టు రెడీగా ఉందని.. మరో 87 మందిపై సర్వేలు నిర్వహిస్తున్నామని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో సోమవారం మీడియాతో మాట్లాడారు. ఇతర పార్టీల నుండి.. టీడీపీలోకి వచ్చేందుకు చాలామంది నేతలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. పవన్ కళ్యాణ్(జనసేన) పొత్తుకు వస్తున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రంగంలో ఉంటుంది. దీటుగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం అని స్పష్టం చేశారు.

పోటీచేస్తున్న క్యాడెంట్స్ పేర్లను వెల్లడిస్తానని.. అప్పటి వరకు వెయిట్ చేయండి అని సూచించారు. తప్పుడు ప్రచారం నమ్మొద్దని కోరారు. చంద్రబాబుతో శనివారం రాజమండ్రి జైలులో భేటీ అయినట్లు పేర్కొన్నారు. చంద్రబాబుపై అక్రమ అరెస్టు తప్పుడు కేసులు నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం వరకు కేసు పూర్తి అవుతుంది. బాబు బయటకు వస్తాడు. నమ్మకం ఉందన్నారు. తెలుగుదేశం మేనిఫెస్టో కూడా సిద్ధంగా ఉంది. చంద్రబాబు ఆలోచనలతో బీసీలకు పెద్ద పీట వేయడం జరిగిందన్నారు.

పోటీ చేయడానికి అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారని.. త్వరలోనే లిస్టును వెల్లడిస్తాం అని స్పష్టం చేశారు. గ్రేటర్‌లో కాకుండా తెలంగాణలోని అన్ని జిల్లాలకు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బాలకృష్ణ ప్రచారానికి వస్తారన్నారు.

Next Story

Most Viewed