- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TS Election: ఓటు వేస్తూ సెల్ఫీ దిగారో.. ఇక అంతే సంగతి!
by GSrikanth |
తెలంగాణలో జోరుగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 35,655 పోలింగ్ కేంద్రాల్లో సుమారు 3.26 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

X
దిశ, వెబ్డెస్క్: తెలంగాణలో జోరుగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 35,655 పోలింగ్ కేంద్రాల్లో సుమారు 3.26 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్ ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించేందుకు దాదాపు లక్ష మంది రాష్ట్ర పోలీసులు, కేంద్ర పారామిలిటరీ బలగాలు, ఇతర రాష్ట్రాల హోంగార్డులను ఎలక్షన్ కమిషన్ వినియోగిస్తున్నది. అయితే, కొందరు ఓటు వేస్తూ సెల్ఫీలు దిగడం మనం చూస్తుంటాం. ఈ క్రమంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎవరైనా ఓటు వేసే సమయంలో సెల్ఫీలు, వీడియోలు తీస్తే నిబంధనల ప్రకారం సదరు వ్యక్తి ఓటు రద్దు చేయబడుతుంది. అందుకే తుంటరి చేష్టలకు పోయి ఓటును కోల్పోవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Next Story






