నకిరేకల్ నేతలతో ఎంపీ కోమటిరెడ్డి కీలక సమావేశం!

by Disha Web Desk 2 |
నకిరేకల్ నేతలతో ఎంపీ కోమటిరెడ్డి కీలక సమావేశం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉమ్మడి నల్గొండ కాంగ్రెస్‌లో రాజకీయం ఆసక్తిగా మారుతోంది. బీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్‌లో చేరబోతున్నారనే ప్రచారం జరుగుతున్న వేళ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కార్యకర్తలతో భేటీ కావడం సంచలనం రేపుతున్నది. శనివారం తన వ్యవసాయ క్షేత్రంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నకిరేకల్ నేతలతో భేటీ అయ్యారు. గత ఎన్నికల్లో నకిరేకల్‌లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన చిరుమర్తి లింగయ్య బీఆర్ఎస్‌లో చేరారు.

దాంతో ఈసారి కాంగ్రెస్ పార్టీలో ఆశావాహుల సంఖ్య పెరిగిపోయింది. ఇదే తరుణంలో వేముల వీరేశం సైతం కాంగ్రెస్‌లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారనే ప్రచారం వేళ వెంకట్ రెడ్డి నకిరేకల్ నియోజకవర్గానికి చెందిన నేతలతో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ తరపున అన్ని స్థానాలకు అభ్యర్థులు ఉన్నారని కొత్తగా ఎవరూ చేరాల్సిన అవసరం లేదని గతంలో వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీంతో కోమటిరెడ్డి భేటీ వేముల వీరేశంను ఆహ్వానించడానికా లేక అడ్డుకోవడానికా అనేది సస్పెన్స్‌గా మారింది.



Next Story

Most Viewed