మంత్రి కేటీఆర్‌పై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీరియస్

by Disha Web Desk 2 |
మంత్రి కేటీఆర్‌పై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీరియస్
X

దిశ,డైనమిక్ బ్యూరో: మునుగోడు పరిశ్రమల సీఎస్ఆర్ నిధులను సిరిసిల్లకు తరలిస్తున్నారని మంత్రి కేటీఆర్‌పై బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధ్వజమెత్తారు. పరిశ్రమల కాలుష్యం మా మునుగోడుకు శాపంగా మారితే ఆ పరిశ్రమల సీఎస్ఆర్ నిధులు సిరిసిల్లకు వరంగా మారాయని ఆరోపించారు. సీఎస్ఆర్ నిధులతో గతంలో సిరిసిల్లలో కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలను నిర్మించిన ఫొటోతో పాటు మునుగోడు నియోజకవర్గంలోని గట్టుప్పల్ ఎస్టీ సాంఘీక సంక్షేమ వసతి గృహంలోని భవనంపై భాగం పెచ్చులూడి ఇనుప చువ్వలు తేలి ప్రమాదకరంగా దర్శనం ఇస్తున్నా ఫొటోనూ రాజగోపాల్ రెడ్డి ట్విట్టర్‌లో షేర్ చేశారు. మునుగోడు నియోజకవర్గం దత్తత మాట దేవుడెరుగు.. వసతి గృహాల కనీస మరమ్మత్తులకు దిక్కు లేకపాయే అని ఈ సందర్భంగా విమర్శించారు.



Next Story

Most Viewed