నాగార్జున సాగర్ ఇష్యూపై సీపీఐ నారాయణ సీరియస్ కామెంట్స్

by Disha Web Desk 2 |
నాగార్జున సాగర్ ఇష్యూపై సీపీఐ నారాయణ సీరియస్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ వేళ నాగార్జునసాగర్ డ్యాం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణ నీటి విడుదల అంశం మరోసారి తెలంగాణ పోలింగ్ రోజున రచ్చరచ్చగా మారింది. దీంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్దకు రెండు రాష్ట్రాల పోలీసులు భారీగా చేరుకున్నారు. తాజాగా.. ఈ అంశంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు.

తెలుగు ప్రజలకు అటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఇటు ఆంధ్రా ముఖ్యమంత్రి జగన్ ద్రోహం చేసేలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. వీళ్లతో పాటు బీజేపీ కూడా కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈ ముగ్గరూ కలిసి పోలింగ్ వేళ రాజకీయ లబ్ధిపొందేలా నాగార్జున సాగర్ వద్ద అర్ధరాత్రి హంగామా సృష్టించారని మండిపడ్డారు. నీటి వివాదం కొత్తది కాదని.. కానీ, రాజకీయ లబ్ధి కోసమే పోలింగ్‌కు ముందు రోజు వివాదం క్రియేట్ చేశారని అన్నారు. కేవలం ఇది తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చు పెట్టే కుట్రే అని తేల్చి చెప్పారు. రాజకీయ కుట్రలను తెలుగు ప్రజలు గమనించాలని పిలుపునిచ్చారు.

Read More..

వ్యూహాత్మకంగానే వివాదం.. నాగార్జున సాగర్ ఇష్యూపై రేవంత్ రియాక్షన్

నాగార్జున సాగర్ అంశంపై అంబటి రాంబాబు వివాదాస్పద ట్వీట్!

Next Story

Most Viewed