కేటీఆర్ మీద ఉన్న గౌరవం పోతోంది: షబ్బీర్ అలీ

by Disha Web Desk 2 |
కేటీఆర్ మీద ఉన్న గౌరవం పోతోంది: షబ్బీర్ అలీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ ప్రకటించిన మైనార్టీ డిక్లరేషన్ పై మాట్లాడే హక్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు లేదని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ అన్నారు. కాగ్రెస్ ప్రకటించిన మైనార్టీ డిక్లరేషన్ మైనార్టీలు, బీసీల మధ్య చిచ్చుపెట్టేలా ఉందని కేటీఆర్ చేసిన ఆరోపణలపై షబ్బీర్ అలీ శనివారం కౌంటర్ ఇచ్చారు. మైనార్టీ డిక్లరేషన్‌పై ఆయన కనీసం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మైనార్టీలకు ఇస్తామన్న 12 శాతం రిజర్వేషన్ ఇచ్చి కేటీఆర్ మాట్లాడితే బాగుంటుందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్, బీజేపీలు రెండు ఒక్కటే అని, లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్ కాకుండా బీఆర్ఎస్, బీజేపీలు ఒప్పందం కుదుర్చుకున్నాయని ఆరోపణలు గుప్పించారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేసీఆర్ కలిసిపోయారన్నారు. ఇన్నాళ్లు కేటీఆర్ మీద కొంత గౌరవం ఉండేదని.. ఇప్పుడు అది కూడా పోయిందని విమర్శించారు.



Next Story

Most Viewed