భువనగిరిలో నేడు కేసీఆర్ బహిరంగ సభ.. వర్షం వచ్చినా నో టెన్షన్!

by Disha Web Desk 2 |
భువనగిరిలో నేడు కేసీఆర్ బహిరంగ సభ.. వర్షం వచ్చినా నో టెన్షన్!
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా భువనగిరి జిల్లా కేంద్రంలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పైళ్ల శేఖర్‌రెడ్డిని గెలిపించాలని ఆయన అభ్యర్థించనున్నారు. ప్రజా ఆశీర్వాద సభకు భారీ ఏర్పాట్లు చేశారు. జనగామ సభ పూర్తి కాగానే ప్రత్యేక హెలికాప్టర్‌లో సాయంత్రం 4 గంటలకు సభా ప్రాంగణం సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకొంటారు. వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా రెయిన్‌ ప్రూఫ్‌ స్టేజీ వేశారు. బహిరంగ సభ నేపథ్యంలో భువనగిరి పట్టణం గులాబీమయంగా మారింది. జనం ఇబ్బందులు పడకుండా పార్కింగ్‌ ప్రదేశాలను ఏర్పాటు చేశారు. బహిరంగ సభకు 60 వేల మందికి పైగా జనం రానున్నట్టు బీఆర్‌ఎస్‌ శ్రేణులు తెలిపాయి. పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేశారు.

Next Story