రేవంత్ రెడ్డిపై అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 2 |
రేవంత్ రెడ్డిపై అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఎమ్ఐఎమ్ చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీని నాశనం చేసినట్లే కాంగ్రెస్‌ను కూడా రేవంత్ రెడ్డి కనుమరుగు చేస్తాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ భావాజాలం కలిగి ఉన్నాడని.. కాంగ్రెస్ కూడా ప్రస్తుతం ఆర్ఎస్ఎస్ ఆధీనంలోనే ఉందని వ్యాఖ్యానించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కవల పిల్లలని చెప్పారు. ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉంటేనే ప్రజలకు న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. తాము ఏ పార్టీ ఏ టీమ్, బీ టీమ్ కాదని స్పష్టం చేశారు. ప్రజలకు ఎవరు న్యాయం చేస్తారో వారికి మద్దతు ఇస్తామని అన్నారు.

Next Story

Most Viewed

    null