దూకుడు పెంచిన తీన్మార్ మల్లన్న.. కీలక నేతతో భేటీ

by Disha Web Desk 2 |
దూకుడు పెంచిన తీన్మార్ మల్లన్న.. కీలక నేతతో భేటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్‌బీ) పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండ సురేందర్ రెడ్డితో తీన్మార్ మల్లన్న భేటీ అయ్యారు. సోమవారం ఏఐఎఫ్ బీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో తీన్మార్ మల్లన్నతో పాటు మరికొంత మంది నాయకులుఉన్నారు. కాగా, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయబోతున్నారని ఇదివరకే తీన్మార్ మల్లన్న ప్రకటించిన నేపథ్యంలో ఈ భేటీకి రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత ఏర్పడింది.


Next Story