మీరేం నాయకులు.. అధికారంలోకి రావడానికి ఏదైనా చెబుతారా?

by Disha Web Desk 2 |
మీరేం నాయకులు.. అధికారంలోకి రావడానికి ఏదైనా చెబుతారా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రాజెక్టుల్లో లోపాలు సాధారణమేనని నీటి పారుదల నిపుణులు, బీఆర్ఎస్ నేత ప్రకాశ్ అన్నారు. మేడిగడ్డలో నాణ్యతా లోపం ఉంటే ఈ ఐదేళ్లు ఎందుకు డ్యామేజ్ జరగలేదని ఆయన అన్నారు. దీనిపై రిటైర్డ్ ఐఏఎస్, సోషల్ డెమొక్రటిక్ ఫోరం కన్వీనర్ ఆకునూరి మురళి ఇవాళ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘ప్రకాశ్ గారు, మీ అబద్ధాలు ఇక్కడ కూడానా, మీ బాస్ మంచి శిక్షణ ఇస్తున్నట్టుంది మీకు ఎట్లా అబద్ధాలు ఆడి అధికారంలోకి రావాలో.. మీరేం నాయకులండి మంచి పనులు చేసి ప్రజల అభిమానం చూరగొనాలి కానీ అబద్దాలతో కాదు. అబద్దాల అసమర్థ అవినీతి అహంకారపూరిత పాలన నుంచి మన తెలంగాణను రక్షించుకుందాం’ అంటూ బీఆర్ఎస్ నేతను విమర్శించారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed