- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మీరేం నాయకులు.. అధికారంలోకి రావడానికి ఏదైనా చెబుతారా?
ప్రాజెక్టుల్లో లోపాలు సాధారణమేనని నీటి పారుదల నిపుణులు, బీఆర్ఎస్ నేత ప్రకాశ్ అన్నారు. మేడిగడ్డలో నాణ్యతా లోపం ఉంటే ఈ ఐదేళ్లు ఎందుకు డ్యామేజ్ జరగలేదని ఆయన అన్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రాజెక్టుల్లో లోపాలు సాధారణమేనని నీటి పారుదల నిపుణులు, బీఆర్ఎస్ నేత ప్రకాశ్ అన్నారు. మేడిగడ్డలో నాణ్యతా లోపం ఉంటే ఈ ఐదేళ్లు ఎందుకు డ్యామేజ్ జరగలేదని ఆయన అన్నారు. దీనిపై రిటైర్డ్ ఐఏఎస్, సోషల్ డెమొక్రటిక్ ఫోరం కన్వీనర్ ఆకునూరి మురళి ఇవాళ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘ప్రకాశ్ గారు, మీ అబద్ధాలు ఇక్కడ కూడానా, మీ బాస్ మంచి శిక్షణ ఇస్తున్నట్టుంది మీకు ఎట్లా అబద్ధాలు ఆడి అధికారంలోకి రావాలో.. మీరేం నాయకులండి మంచి పనులు చేసి ప్రజల అభిమానం చూరగొనాలి కానీ అబద్దాలతో కాదు. అబద్దాల అసమర్థ అవినీతి అహంకారపూరిత పాలన నుంచి మన తెలంగాణను రక్షించుకుందాం’ అంటూ బీఆర్ఎస్ నేతను విమర్శించారు.
ప్రకాష్ గారు !
— Murali Akunuri (@Murali_IASretd) November 7, 2023
మీ అబద్దాలు ఇక్కడ కూడానా! మీ బాస్ మంచి శిక్షణ ఇస్తున్నట్టుంది మీకు ఎట్లా అబద్దాలు ఆడి అధికారంలోకి రావాలో.
మీరేం నాయకులండి మంచి పనులు చేసి ప్రజల అభిమానం చూరగొనాలి కానీ అబద్దాలతో కాదు.
అబద్దాల అసమర్ధ అవినీతి అహంకారపూరిత పాలన నుండి మన తెలంగాణను రక్షించుకుందాం. pic.twitter.com/PMgNvfrXTQ






