ఎన్నికల విధుల నుంచి వారికి మినహాయింపు ఇవ్వండి

by Disha Web Desk 2 |
ఎన్నికల విధుల నుంచి వారికి మినహాయింపు ఇవ్వండి
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్‌ను పీఆర్టీయూ నేతలు కలిశారు. ఎన్నికల విధుల్లో గర్భిణి ఉపాధ్యాయులకు, వ్యాధిగ్రస్తులైన ఉద్యోగులకు ఎన్నికల విధుల్లో మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌లో వికాస్ రాజ్‌ను కలిసి తమ వినతిపత్రం అందజేశారు. మరోవైపు రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లపై ఈసీ మరింత ఫోకస్ పెట్టింది. ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న అధికారులకు శిక్షణ ఇస్తోంది. ఈ క్రమంలో పలువురు గర్భిణి ఉపాధ్యాయులను ఎన్నికల విధుల్లోకి తీసుకోవడంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నది. ఈ నేపథ్యంలో పీఆర్టీయూ నేతలు సీఈవోను కలిసి ఈ వినతి చేశారు.

Next Story