తెల్లవారితే కౌంటింగ్.. మంత్రి కేటీఆర్ ఆసక్తికర ట్వీట్

by Disha Web Desk 2 |
తెల్లవారితే కౌంటింగ్.. మంత్రి కేటీఆర్ ఆసక్తికర ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆదివారం నాడు కౌటింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్నది. అయితే, ఎవరికి వారు ప్రధాన పార్టీల నేతలు ధీమాతో ఉన్నారు. ఎగ్జిట్ పోల్స్ తమవైపే ఉన్నాయని కాంగ్రెస్.. ఎగ్జాట్ పోల్స్ తమవైపు ఉన్నాయని బీఆర్ఎస్ నేతలు పూర్తి ధీమాతో ఉన్నారు. తుది ఫలితాలు రేపు సాయంత్రం వరకు క్లియర్‌గా తెలియనున్నాయ. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. బంపర్ మెజార్టీతో బీఆర్ఎస్‌ గెలవబోతోందని, కేసీఆర్‌ హాట్రిక్ కొట్టబోతున్నాడని.. సెలబ్రేట్ చేసుకోవడానికి రెడీ ఉండండి అంటూ ట్వీట్ చేశారు. తెల్లవారితే కౌంటింగ్ ఉన్న నేపథ్యంలో కేటీఆర్ చేసిన ఈ ట్వీట్ ఆసక్తికరంగా మారింది.



Next Story

Most Viewed