నిరుత్సాహ పడం.. మళ్లీ పుంజుకుంటాం: కేటీఆర్

by Disha Web Desk 2 |
నిరుత్సాహ పడం.. మళ్లీ పుంజుకుంటాం: కేటీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. సంపూర్ణ మెజార్టీ సాధించిన కేటీఆర్ అభినందనలు చెప్పారు. వరుసగా రెండుసార్లు తమకు అవకాశం ఇచ్చిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ ఎన్నికల్లో తాము ఊహించిన ఫలితాలు రాలేదని అసహనం వ్యక్తం చేశారు. ఓటమి ఫలితాల నుంచి పాఠాలు నేర్చుకుంటామని తెలిపారు. ఈ ఫలితాలతో తాము నిరుత్సాహ పడబోమని, మళ్లీ పుంజుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.



Next Story

Most Viewed