- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మాదిగలకు మంత్రి హరీష్ రావు కీలక హామీ
దిశ, డైనమిక్ బ్యూరో: ఎస్సీ వర్గీకరణను ప్రధాని నరేంద్ర మోడీ ఆలస్యం చేస్తున్నారని, పార్లమెంట్లో వర్గీకరణ బిల్లు పాస్ చేయాల్సిందే మంత్రి హరీష్ రావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇవాళ ఇందిరాపార్కు వద్ద మాదిగల యుద్ధభేరి సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందుకు పోతుందని, తెలంగాణ దేశానికి దిక్సూచిగా మారాలని అన్నారు.
మాదిగల ఆత్మగౌరవం పెరగాలని, రాబోయే రోజుల్లో హైదరాబాద్లో మాదిగల కోసం ఆత్మగౌరవ భవనం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. సదా లక్ష్మీ విగ్రహం హైదరాబాద్లో ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తదని, ఎస్సీల కోసం సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేశారని, మాదిగలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీ, నామినేటెడ్ పదవుల్లో గాని ఇతర అవకాశాలు మాదిగలకు తగిన ప్రాతినిధ్యం కల్పించడం కోసం సీఎం దృష్టికి తీసుకు వెళ్లనున్నట్లు వరాల జల్లు కురిపించారు.