మందుబాబులకు BIG అలర్ట్.. కాసేపట్లో వైన్సులు క్లోజ్

by Disha Web Desk 2 |
మందుబాబులకు BIG అలర్ట్.. కాసేపట్లో వైన్సులు క్లోజ్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ వ్యాప్తంగా మరికొన్ని గంటల్లో ప్రచార పర్వం ముగియనుంది. సాయంత్రం ఐదు గంటల తర్వాగ రాష్ట్రంలో 144 సెక్షన్ అమల్లోకి రానుంది. ఐదు గంటలు దాటిన తర్వాత ఎవరైనా ప్రచారం చేసినట్లు కనిపిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఎన్నికల సంఘం అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉండగా.. సాయంత్రం ఐదు గంటలకు రాష్ట్రంలోని అన్ని మద్యం షాపులు బంద్ చేయనున్నారు. ఇప్పటికే ఆబ్కారీ శాఖకు ఆదేశాలు కూడా జారీ చేశారు. తిరిగి ఈనెల 30వ తేదీన పోలింగ్ పూర్తయిన తర్వాత మద్యం షాపులు ఓపెన్ చేయనున్నారు. అంటే దాదాపు మూడు రోజుల్లో 48 గంటల సేపు వైన్ షాపులు క్లోజ్ చేసి ఉంచుతారు. అయితే, అభ్యర్థులు పోలింగ్ రోజు పంచేందుకు మద్యం నిల్వ చేసుకుని ఉంటారు కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చని సోషల్ మీడియా వేదికగా పలువురు ఫన్నీగా అభిప్రాయపడుతున్నారు.



Next Story